calender_icon.png 15 June, 2025 | 7:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

14-06-2025 05:57:54 PM

సీఐటీయూ..

ఇల్లెందు (విజయక్రాంతి): కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఎన్ డీ ఏ ప్రభుత్వం కార్మిక, కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నదని కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా చేసే విధంగా కార్పోరేట్ శక్తులకు ఆకులంగా పనిచేస్తున్నదని అందులో భాగంగా కార్మికులు 1886 నుండి 1990 వరకు ప్రభుత్వాలు, యాజమాన్యాలతో పోరాడి తేచ్చుకున్న 44 చట్టాలను నిర్వీర్యం చేస్తూ 29 చట్టాల స్థానే నాలుగు లేబర్ కోడ్ లను తెచ్చిందని దానికి వ్యతిరేకంగా శ్రామిక వర్గాలు ఐక్యమై ప్రభుత్వం మెడలు వంచి తమ చట్టాలు పునరుద్ధరించుకోవాలని సిఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అబ్దుల్ నబి(CITU District Assistant Secretary Abdul Nabi) పిలుపునిచ్చారు.

శనివారం ఏలూరి భవన్ లో జరిగిన సిఐటీయూ ఇల్లందు మండల కమిటీ సమావేశం కల్లేపల్లి మరియా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. గతనెల 20న జరగవలసిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె దేశ సంక్లిష్ట పరిస్థితుల నేపధ్యంలో జూలై 9కి వాయిదా పడిందని ఈ సమ్మె రాజకీయ పరిణామాలలో మార్పులు తెచ్చే చరిత్రాత్మ సమ్మె అని ఈ సమ్మెకు రైతు, వ్యవసాయ కార్మికులు సంపూర్ణంగా మద్దతు నిస్తూ గ్రామీణ హర్తాళ్ కు పిలుపు నిచ్చాయని ఆయన అన్నారు. తాళ్లూరి కృష్ణ మాట్లాడుతూ.. గ్రామ గ్రామాన కార్మిక పని ప్రదేశాలు నివాస ప్రాంతాల్లో విరివిగా సమ్మె ప్రచారం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఈసం వెంకటమ్మ, సుల్తానా, చీమల రమణ, ఫాతిమా, ఉమాదేవి, ఈసం రాధ, చంద్రకళ, మహమూద్, కటకం రాజయ్య, భద్రు, రమేష్, నజీర్, లక్ష్మణ్ రావు, హుస్సేన్, బోయిన పద్మ, రాజ శేఖర్, తదితరులు పాల్గొన్నారు.