18-06-2025 08:31:07 AM
హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా(Medchal Malkajgiri) బాచుపల్లి మిథిలానగర్(Mithila Nagar Colony) కాలనీలోని ఓ అపార్టుమెంట్ ఫ్లాట్లో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. అపార్టుమెంట్ లో చుట్టుపక్కల వారు భయంతో పరుగులు పెట్టారు. మంటలను చూసి అప్రమత్తమైన మరికొందరు స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు(Firefighters) హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అపార్టు మెంట్ ప్లాట్ లో ఏసీకి మంటలు అంటుకున్నాయి. విద్యుదాఘాతంతో మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక సిబ్బంది వెల్లడించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.