calender_icon.png 18 June, 2025 | 1:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

18-06-2025 08:21:32 AM

తిరుమల తిరుపతి దేవస్థానంలో(Tirumala Tirupati Devasthanam) బుధవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి(Srivari Sarva Darshan) 18 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు ప్రకటించారు. శ్రీవారి సర్వదర్శనానికి ఏటీజిహెచ్ క్యూలైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం తిరుమల శ్రీవారిని 81,037 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమలలో 30,548 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.12 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు(TTD officials) వెల్లడించారు. నేడు శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు, దర్శన టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆన్ లైన్ కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు ఆర్జిత సేవల ఎలక్ట్రానిక్ డిప్ నమోదుకు టీటీడీ అవకాశం కల్పించింది.