24 August, 2026 | 10:15 PM

Breaking News

మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •   ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి   •  

అర్ధరాత్రి హోటల్లో చెలరేగిన మంటలు

14-03-2025 04:45 PM

కూకట్ పల్లి,(విజయక్రాంతి): ప్రమాదవశాత్తు ఓ హోటల్ ఎలక్ట్రికల్ నేమ్ బోర్డ్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు, ఫైర్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. వివేకానంద నగర్ కాలనీ కమాన్ వద్ద ఉన్న పల్లవి హోటల్ లో నేమ్ బోర్డ్ లో  షార్ట్ సర్క్యూట్ చెలరేగి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ క్రమంలోని అందులో పనిచేస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి మంటల ని ఆర్పేందుకు ప్రయత్నించాడు. దీంతో అతని రెండు చేతులు స్వల్పంగా కాలి గాయాల పాలయ్యాడు. వెంటనే స్థానికులు చికిత్స కోసం ఆసుపత్రి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఫైర్ స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకొని ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలని ఆర్పివేశారు. అర్ధరాత్రి కావడంతో ప్రమాదవశాత్తు హోటల్లో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం చోటు చేసుకోలేదు. హోటల్ నిర్వాహకులు ఎలాంటి ఫైర్ సేఫ్టీ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.