18-06-2025 02:15:47 PM
స్థానిక ఎన్నికల కోసమే రైతు భరోసా
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయ డంకా
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని అబద్దాలతో పాలన సాగిస్తూ అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో రైతు భరోసా 15 వేలు ఇస్తా అని చెప్పి రైతాంగాన్ని మోసం చేసిందని అన్నారు.కానీ కెసిఆర్ ఏ హామీ లేకుండనే ఎకరానికి 12 వేల రైతుబందు ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ రైతులను అన్ని విధాలుగా మోసం చేస్తుందని దు య్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కెసిఆర్ జమ చేసిన డబ్బులను కూడా రైతులకు ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు కమిషన్లు తీసుకుని బిల్లులు ఇచ్చారని మండిపడ్డారు.
ఇపుడు ఎన్నికలు వస్తున్నాయని రైతు భరోసా ఇస్తాడట ఒక్కో రైతుకు కాంగ్రెస్ సర్కార్ 30 వేలు బాకీ పడ్డదని తెలిపారు. కుప్పలు కుప్పలుగా అప్పులు తెస్తూ కమిషన్ల కోసం బిల్లులు చెల్లెస్తున్నారని ఆరోపించారు. ఒక్క ఉమ్మడి జిల్లా రైతులకే యాసంగిలో 800 కోట్లు బాకీ పడ్డారని జిల్లాకు చెందిన ఇద్దరు చేతగాని మంత్రులుగా మిగిలిపోయారని ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో చేస్తున్న విచారణ అంతా బుటకం అన్నారు. ఈ ఫార్ములా కేసులోనూ జరిగిన తప్పేమి లేదని కానీ కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.కేటీఆర్ కు పదే పదే విచారణ పేరుతో నోటీసులు ఇవ్వడన్ని ఖండిస్తున్నామన్నారు.మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజల ద్రుష్టి ని మల్లించేందుకే కేసులు, నోటీసులు పెడుతున్నారని ఆరోపించారు.
ఫోన్ టాపింగ్ అనేది కాంగ్రెస్ నేతలు ఎలా నిర్ధారణ చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఎన్ని కేసులు పెట్టినా... బిఆరెస్ భయపడబోదని ప్రజల్లో ఉండి ప్రభుత్వం పై పోరాట చేస్తామని తెలిపారు.స్థానిక ఎన్నికల కోసమే రైతు భరోసా ఇన్నాళ్లు ఎన్నికలు పెట్టకుండా స్థానిక సంస్థలనూ నిర్వీర్యం చేశారనిబీసీ రిజర్వేషన్ లేకుండానే ఎన్నికలకు ఎలా వెళ్తారని పేర్కొన్నారు. 42 శాతం రిజర్వేషన్ తోనే ఎన్నికలు నిర్వహించాలని గత సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, స్థానిక కాంట్రాక్టర్లకు తక్షణమే బిల్లులు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆరెస్ విజయ డంకా మొగిస్తదని అన్నారు. ఈ సమావేశంలో ఆ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.