calender_icon.png 18 June, 2025 | 5:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడ్చల్ బస్సు డిపో నుంచి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులు

18-06-2025 02:11:14 PM

మేడ్చల్ అర్బన్: మేడ్చల్ బస్ డిపో మేనేజర్ సుధాకర్(Medchal Bus Depot Manager Sudhakar) విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండి సూచనల మేరకు మేడ్చల్ బస్సు డిపో నుండి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సౌకర్యం జూన్ 27వ తేదీన ప్రారంభమవుతుందని చెప్పారు. ఉదయం ఐదు గంటలకు మేడ్చల్ బస్సు డిపో నుండి కాలేశ్వరం, రామప్ప, భద్రకాళి, వేయి స్తంభాల గుడి దర్శన అనంతరం మేడ్చల్ బస్సు డిపోకు తిరిగి రాత్రి 10 గంటలకు బస్సు చేరుకుంటుందని తెలియజేశారు. కు సంబంధించిన టికెట్ ధరలు పెద్దలకు రూ. 1200 కాగా, పిల్లలకు రూ. 600 ఉంటుందని చెప్పారు. కాగా వారంలోని చివరి రోజుల్లో ఈ సర్వీసులు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ సౌకర్యాన్ని మేడ్చల్  ప్రజలతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సభ్యులను చేసుకోవాలని డిపో మేనేజర్ సుధాకర్ కోరారు. మరిన్ని వివరాల కొరకు 9849737131 ద్వారా సంప్రదించాల్సిందిగా సూచించారు.