సాకేర గ్రామంలో మంచినీటి ఎద్దడి— ట్యాంకర్ల ద్వారా సరఫరా
05-05-2026 10:45 AM
బోథ్,(విజయక్రాంతి): సోనాల మండలంలోని సాకేర గ్రామంలో మంచినీటి ఎద్దడి రోజురోజుకు తీవ్రమవుతున్నది. భూగర్భ జలాలు ఇంకిపోవడంతో త్రాగునీటి ఎద్దడి ఎదురవుతుందని గ్రామస్తుల పేర్కొంటున్నారు. అయితే గ్రామంలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు సర్పంచ్ జాదవ్ మోతి సింగ్ తెలిపారు. ప్రతిరోజు 6 ట్యాంకర్ల వరకు సరఫరా చేస్తున్నామన్నారు. మిషన్ భగీరథకు చెందిన సంప్ నుండి నేరుగా కనెక్షన్ ఇచ్చినట్లయితే గ్రామంలో నీటి ఎద్దడి నివారించే వీలుందని పేర్కొన్నారు. అధికారులు ఈ దిశగా ఆలోచన చేసి నీటి ఎద్దడి లేకుండా చూడాలని ఆయన కోరారు.






