మీ భూములివ్వండి!
‘ఫ్యూచర్ సిటీ’ రైతుల నుంచి సీఎం రేవంత్రెడ్డికి సవాల్
* మా భూములు అభివృద్ధికి అవసరమైతే, ముందుగా మీరు, మీ పార్టీ నాయకులు మీ భూములు మాకు ఇవ్వండి. మీ భూముల దగ్గర మా గ్రామాలను నిర్మించండి. ఒకటి లేదా రెండు ఎకరాలు మాత్రమే ఉన్న చిన్న రైతులను ‘ఫ్యూచర్ సిటీ’ పేరుతో అన్నింటినీ కోల్పోయేలా చేయకుండా, ఆ త్యాగం ముందుగా మీరే ప్రారంభించాలి.
‘ఫ్యూచర్ సిటీ’ రైతులు
హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి) : ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్పై రాష్ట్రం లో కొత్త వివాదం నెలకొంది. భూముల రక్షణపై ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయలేదని ఆ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులు ఆరోపిస్తున్నారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషన రేట్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. పరిహారం నచ్చని రైతులు ఇతర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసుకోవచ్చని ఆయన సూచించారని రైతులు చెబుతున్నారు.
దీనిపై యాంటీ ఫార్మా సిటీ స్ట్రగుల్ కమిటీ సభ్యులు తీవ్ర నిరాశ వ్యక్తంచేస్తూ, ఇది నమ్మకద్రోహమని ఆగ్రహం వ్యక్తంచేశారు. అభివృద్ధి కోసం త్యాగం చేయాల్సి వస్తే ముందుగా సీఎం, అధికార పార్టీ నాయకులే తమ భూము లు ఇవ్వాలని రైతులు సవాల్ చేశారు. ‘మా భూములు అభివృద్ధికి అవసరమైతే, ముందుగా మీరు, మీ పార్టీ నాయకులు మీ భూములు మాకు ఇవ్వండి. మీ భూముల దగ్గర మా గ్రామాలను నిర్మించండి. ఒకటి లేదా రెండు ఎకరాలు మాత్రమే ఉన్న చిన్న రైతులను ‘ఫ్యూచర్ సిటీ’ పేరుతో అన్నింటినీ కోల్పోయేలా చేయకుండా, ఆ త్యాగం ముందుగా మీరే ప్రారంభించాలి’ అని రైతులు పేర్కొన్నారు.
ప్రతిపక్షంలో ఉన్న సమయంలో, అప్పటి పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్రెడ్డి స్వయంగా ప్రభావిత రైతులకు వారి భూములు రక్షిస్తామని హామీ ఇచ్చారని వారు గుర్తుచేశారు. అలాగే భట్టి విక్రమార్క, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కోదండరెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి వంటి సీనియర్ నాయకులు పాదయాత్రల్లో పాల్గొని రైతులు భూములు ఇవ్వొద్దని కోరుతూ, అధికారంలోకి వస్తే భూసేకరణను రద్దు చేస్తామని హామీ ఇచ్చారని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం ఫార్మా సిటీ ప్రాజెక్ట్ను రద్దుచేశామని చెప్పినప్పటికీ, సంబంధిత జీఓను అధికారికంగా రద్దుచేయలేదని రైతులు వాదిస్తున్నారు.
ఫార్మా సిటీకి బదులుగా ‘ఫ్యూచర్ సిటీ’ పేరుతో అదే భూసేకరణను మరో రూపంలో కొనసాగిస్తున్నారని, ఎన్నికల ముందు స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. ఇక ప్రాజెక్ట్ ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గిరిజన రైతులు గత 46 రోజులుగా రీలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. భూసేకరణతో పాటు గ్రీన్ఫీల్డ్ హైవే వంటి అనుబంధ ప్రాజెక్టులను కూడా రద్దుచేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీర్ఘకాలంగా ఆందోళనలు చేస్తున్నప్పటికీ తమ సమస్యలను పట్టించుకోవడం లేదని నిరసనకారులు ఆవేద న వ్యక్తంచేస్తున్నారు.
కుర్మిద్ద, తాటిపర్తి, నానక్నగర్, మేడిపల్లి గ్రామాలకు చెంది న రైతులు తమ భూములను కాపాడుకునేందుకు కోర్టు నుంచి స్టే ఆర్డర్లు పొందిన ప్పటికీ, గత హామీలు, ప్రస్తుత విధానాల మధ్య తీవ్ర వ్యత్యాసం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. భూములు వదిలి వెళ్లాలని ప్రభుత్వ సూచిస్తుందని, కానీ అది తమ జీవనాధారం, భూమితో ఉన్న అను బంధాన్ని తక్కువ చేసి చూసినట్టేనని విమర్శించారు.
‘మా భూములు అభివృద్ధికి తప్పనిసరిగా అవసరమైతే, ముందుగా మీరు, మీ పార్టీ నాయకులు మీ భూములు మాకు ఇవ్వండి. మీ భూముల దగ్గర మా గ్రామాలను నిర్మించండి. ఒకటి లేదా రెండు ఎకరాలున్న చిన్న రైతులను ‘ఫ్యూచర్ సిటీ’ పేరుతో అన్నిం టినీ కోల్పోయేలా చేయకుం డా, ఆ త్యాగం ముందుగా మీరే ప్రారంభించాలి’ అని ఆ రైతులు చెబుతు న్నారు.






