దీపాన్షుకు స్వర్ణం

25-04-2024 12:37:09 AM

న్యూఢిల్లీ: ఏషియన్ అండర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటారు. మెన్స్ జావెలిన్ విభాగంలో దీపాన్షు శర్మ స్వర్ణ పతకం సాధించాడు. ఈటెను 70.29 మీటర్ల దూరం విసిరి స్వర్ణం సాధించగా.. భారత్‌కే చెందిన మరో అథ్లెట్ రోహన్ యాదవ్ ఈటెను 70.03 మీటర్ల దూరం విసిరి రజతం గెలుచుకున్నాడు. ఇక పురుషుల 1500 మీటర్ల రేసులో ప్రియాన్షు 3:50.85 సెకన్లలో గమ్యాన్ని  చేరి రజతం కైవసం చేసుకున్నాడు. ఇక ఉదయం సెషన్‌లో ఈవెంట్స్ విషయానికి వస్తే మెన్స్ డిస్కస్ త్రో విభాగంలో రితిక్ రజతం గెలుచుకోగా.. మహిళల 3వేల మీటర్ల రేసులో ప్రాచీ అంకుశ్ తృటితో కాంస్య పతకం చేజార్చుకుంది. ఇక 400 మీటర్ల మహిళల హర్డిల్స్ విభాగంలో జయవింధియా, శ్రియా రాజేశ్‌లు  మెడల్ రౌండ్‌కు అడ్వాడ్స్ అయ్యారు.