17 April, 2026 | 11:55 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ప్రభుత్వ ఉద్యోగి సినీ ఫక్కీలో కిడ్నాప్

28-04-2025 11:22 PM

మహదేవపూర్ (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగి అయినా ములుగు జిల్లా కేంద్రంలో హౌసింగ్ ఏఈగా పనిచేస్తున్న ఇస్సాకు హుస్సేన్ ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయడంతో మండల కేంద్రంలో సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే... జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగి ఏఈ ఇస్సాకు హుస్సేన్ గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. మండల కేంద్రంలోని జమా మసీదులో సాయంత్రం నమాజ్ చేసిన అనంతరం బయటికి రాగా అందరూ చూస్తుండగానే కొందరు గుర్తుతెలియని వ్యక్తులు  వాహనంలో వచ్చి ఇసాక్ హుస్సేన్ ను పట్టుకొని కొడుతూ స్థానికులు చూస్తుండగానే వాహనంలో ఎక్కించుకొని తీసుకొని వెళ్లడం జరిగింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది, దీనిపై ఆతడి సోదరుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.