01-06-2025 04:44:18 PM
హైదరాబాద్: ప్రొ. జయశంకర్ వ్యవసాయ వర్శిటీ విత్తనాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి రైతులకు పంపిణీ చేయనుంది. విత్తన స్వయ సమృద్దే లక్ష్యంగా గ్రామాల్లో నాణ్యమైన విత్తన పంపిణీని ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ సందర్భంగా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నుంచి విత్తన పంపిణీ జరుగుతుందని తెలిపారు. ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకు 5 పంటల విత్తనాలు పంపిణీ చేస్తామని, ఈ విత్తనాల పంపిణీ మంత్రులు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల గ్రామాల్లో 40 వేల మందికి విత్తనాల పంపిణీ చేస్తామని మంత్రి తుమ్మల వెల్లడించారు.