14-06-2025 12:00:00 AM
విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు యూనిఫామ్ పంపిణీ ప్రభుత్వ విప్ చేతుల మీదుగా అంగన్వాడి పిల్లలకు అక్షరాభ్యాసం
రాజన్న సిరిసిల్ల జూన్ 13 (విజయక్రాంతి ); ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వేములవాడ శాసనసభ్యులు. ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం బడి బాట కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అనంతర. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేసి అంగన్వాడి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.కార్యక్రమంలో డీఈవో, ఎంఈఓ తో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, డైరెక్టర్ నామాల ఉమా, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కత్తి కనకయ్య, పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, అర్బన్ మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య, రూరల్ మండల అధ్యక్షుడు వకుళాభరణం శ్రీనివాస్, కూరగాయల కొమరయ్య, సాగరం వెంకటస్వామి, గూడూరి మధు, పుల్కం రాజు, నాయకులు, కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడి కార్యకర్తలు, విద్యార్థులు తదితరులుపాల్గొన్నారు.