calender_icon.png 15 June, 2025 | 7:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్ స్కూళ్లు వద్దు.. అంగన్వాడీలే ముద్దు

14-06-2025 12:00:00 AM

జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్.లత 

జగిత్యాల అర్బన్, జూన్ 13 (విజయక్రాంతి): పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ లోకి పంపకుండా అంగన్వాడి స్కూల్ కు పంపాలని, అంగన్వాడీ కేంద్రాల్లో ఆటపాటల ద్వారా విద్యను అందిస్తారని, తద్వారా పిల్లల్లో సమగ్రాభివృద్ధి జరుగుతుందని, తల్లిదండ్రులు పిల్లల్ని తప్పనిసరిగా అంగన్వాడి కేంద్రాలకు పంపాలని జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత అన్నారు.

శుక్రవారం మహిళ అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధ్వర్యంలో కొడిమ్యాల లో మండల స్థాయి ’అమ్మ మాట - అంగన్వాడి బాట’ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ లత మాట్లాడుతూ అంగన్ వాడి కేంద్రములో పిల్లల నమోదు, హాజరు శాతాన్ని పెంచాలని సూచించారు. పోషకాహారం తో పాటు ఆట పాటలతో కూడుకున్న విద్యను పిల్లలకు అందజేయమే అం గన్ వాడి కేంద్రాల ప్రత్యేకత అని అన్నారు.

తల్లి దండ్రులు తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రాల కు తప్పనిసరిగా పంపాలని కోరారు. జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ బోనగిరి నరేష్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో బోధించే బోధన ద్వారా పిల్లల్లో మెదడు అభివృద్ధి బాగా జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా భోజన మెనూ లో భాగంగా ఎగ్ బిర్యానీ పౌష్టికాహార పంపిణీని ప్రారంభించడం జరుగుతుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో కొడిమ్యాల ఎంపీడీవో స్వ రూప, ఎంఈఓ శ్రీనివాస్, మల్యాల సిడిపిఓ వీరలక్ష్మి, సూపర్వైజర్లు పవిత్ర, సుధారాణి, ఉమ, శారద, జానకి, జ్యోతి మహేశ్వరీ, అంగన్వాడీ టీచర్లుపాల్గొన్నారు.