calender_icon.png 15 June, 2025 | 5:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి

14-06-2025 12:00:00 AM

ఎస్పీ కె.నరసింహ 

సూర్యాపేట, జూన్ 13 (విజయక్రాంతి) : నేడు జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

నేడు జాతీయ మెగా లోక్ అదాలత్ ఉన్నందున రాజీ పడదగిన కేసులలో, క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు,  కుటుంబ పరమైన కేసులు, డ్రంకన్ డ్రైవ్ కేసులు, మోటారు ట్రాన్స్పోర్ట్ రోడ్డు నిభందనలు ఉల్లంఘన కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం,  చెక్ బౌన్స్ మొదలగు కేసుల్లో కక్షిదారులు రాజీ పడే అవకాశం ఉంటుందన్నారు.

చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృదా చేసుకోవద్దన్నారు. న్యాయశాఖ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలనీ పేర్కొన్నారు.