03-06-2025 01:16:07 AM
పాల్గొన్న గులాబీ నేతలు
హైదరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను సోమవారం పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. శాసనమండలిలో విపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి హరీశ్రావుతో కలసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పలువురు నేతలు మాట్లాడారు.
కేసీఆర్ నాయకత్వం, పోరాట పటిమతోనే తెలంగాణ సాధ్యమైందని శాసన మండలి విపక్ష నేత మధు సూదనాచారి ఉద్ఘాటించారు. రాష్ర్టంలో కాంగ్రెస్ పాలనపై ఏడాది కాలంలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని పాలనలో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయన్నారు.
ఉద్యమసమయంలో సాగరహారం కార్యక్రమా నికి వచ్చిన ప్రజల ఉప్పెనను చూసి నాటి ప్రభుత్వం వణికిపోయిందని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ఉద్యమం లో ఆత్మ బలిదానాలు కలచి వేశాయని, ఓ దశలో తన మంత్రి పదవికి రాజీనామా చేయాలనుకున్నానని ఆమె అన్నారు. ఉద్యమంలో హరీశ్ రావు మా ఇంటి ముందు ధర్నా చేశారని, ఇంట్లోకొచ్చి తిన మంటే తాము తెచ్చుకున్నదే తింటామని గేటు దగ్గరే తిన్నా రన్నారు.