calender_icon.png 4 June, 2025 | 5:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

03-06-2025 01:16:31 AM

-  దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు

- తెలంగాణ రైజింగ్ విజన్ ముందుకు 

వికారాబాద్, జూన్2:ప్రజా సంక్షేమ కో సం ప్రవేశపెట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాల ను అమలు చేయడానికి శక్తివంచన లేకుం డా కృషి చేస్తానని  శాసనసభ సభాపతి గ డ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.సోమవారం  సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా శాసనసభ సభాపతి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి  జాతీయ జెండాను  ఎగరవేసి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ...  ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేదవాడికి అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన ఈ సంవత్సరన్నర కాలంలో అనేక ప్రతిష్టాత్మక అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ను చేపట్టడం జరిగిందని, సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు సమ ప్రాధాన్యతనిస్తూ సమగ్రాభివృద్దిని సాధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుంది అన్నారు. తెలంగాణ రైజింగ్-2047 విజన్ తో  ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి ఆర్థిక, సామాజిక, ప రిపాలన రంగాలలో ఆదర్శవంతమైన లక్ష్యాలతో  తెలంగాణ రైజింగ్-2047 విజన్ డా క్యుమెంట్ ను రూపొందించినట్టు  ఇటీవల జరిగిన నీతి అయోగ్ సమావేశంలో  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి వెల్లడించారన్నారు. ఆడ బిడ్డలు ఆనందంగా ఉన్న ఇంట మ హాలక్ష్మి తాండవిస్తుందిని, అందుకే రాష్ట్రం లో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్య క్రమాలు చేపడుతుందని ఆయన తెలిపారు.

సమాజంలో సగ భాగంగా ఉన్న మహిళల సరత్వోముఖాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలూ తీసుకొంటోంద ని, మహిళలు ఆర్థిక స్వావలంబన పొందేందుకు ప్రభుత్వం ‘ఇందిరా మహిళా శక్తి మి షన్’ పాలసీని ఆవిష్కరించడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని కోటి మంది స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులను చేయాలని, వారిని పారిశ్రామిక వేత్తలు గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో తొలి ఏడాదిలోనే రాష్ట్రంలో 21వేల కోట్ల రూపాయలకు  పైగా వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసిందని, మన జిల్లాలో ఇప్పటి వరకు 20 కోట్ల 37 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలను పం పిణీ చేసామని తెలిపారు.

 ప్రజా  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మొదటిగా మహాలక్ష్మి పథ కం కింద రాష్ట్రంలోని మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు.మన జిల్లాలో ఉచిత ప్రయాణం ద్వారా 3 కోట్ల 19 లక్షల రూపాయలను మ హిళలు ఆదా చేసుకోవడం జరిగిందని ఆయన అన్నారు.

మహాలక్ష్మి పథకం కింద గృహిణులకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేయడం జరుగుతోంది.

మన జిల్లాలో 1 లక్ష 19 వేల 735 కుటుంబాలకు ప్రయోజనం చేకూరిందని తెలిపా రు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ సొంత ఇల్లు లేనివారు ఉండరాదన్న లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని అమలు పరుస్తున్నామని తెలిపారు. కొంత మందికి తొలిదశ చెల్లిoపులు కూడా చేశారని తెలిపారు.మన జిల్లాలో ఇ ప్పటి వరకు 5  వేల 2  వందల 14  మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లను మంజూ రు చేయడం జరిగింది. నిర్మాణ దశలను బ ట్టి ఇప్పటి వరకు 92 లక్షల రూపాయలను లబ్దిదారుల ఖాతాలలో జమ చేయడం జరిగిందన్నారు.

అదే విధంగా తెలంగాణ మహిళలతో వి ద్యుత్ ప్లాంట్లు,  మహిళలు పెట్రోలు బంకు ల నిర్వహణ, మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహ ణ చేపట్టారని, శిల్పారామంలో 100 ఇం దిరా మహిళా శక్తి స్టాళ్ళను ప్రభుత్వం ప్రా రంభించింది. అధికారంలోకి వచ్చిన కేవలం ఎనిమిది నెలల కాలంలో రాష్ట్రంలో 25 లక్ష ల 35 వేల 964 మంది రైతులను రుణ వి ముక్తులను చేసి 20 వేల 617 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది.

జిల్లాలో లక్షా 358 మంది రైతులకు రూ. 849 కోట్లు రుణమాఫీ చేశాం..

రైతుభరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నామని,  రైతు భరోసా కింద మన జిల్లాలో 2,26,253 మంది రైతులకు రూ.213 కోట్లు రైతుల ఖాతాలో జమచేశామని ఆయన తెలిపారు. సన్న రకం వరి ధాన్యం సాగుకు రైతులను  ప్రోత్సహించేందుకు సన్నరకం ధాన్యానికి క్వింటా లుకు 500 రూపాయల బోనస్ ను అందిస్తున్నామని దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం చేకూరడంతో పాటు, రాష్ట్రంలో సన్నధాన్యం దిగుబడి కూడా భారీగా పెరిగిందదని తెలిపారు.

మన జిల్లాలో 64,437 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 104 కోట్ల రూపాయలను రైతుల ఖాతా లో జమ చేసాము. సన్న ధాన్యానికి బోనస్ గా ఎకరానికి 500 రూపాయల చొప్పున 49,680 క్వింటాలకు గాను 2 కోట్ల 48 లక్షల రూపాయలు రైతుల ఖాతాలలో జమచేయడం జరుగుతుందని తెలిపారు.

వ్యవ సాయ రంగంలో కీలకంగా మారిన భూమి లేని వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించి‘ఇందిరమ్మ ఆత్మీయ భ రోసా పథకం’ ద్వారా  భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబానికి గతంలో ఎన్న డూ లేనివిధంగా ఏడాదికి 12 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నా రు. మన జిల్లాలో 19 వేల 888 లబ్ది దారులకు మొదటి విడతగా 11 కోట్ల 93 లక్షల రూపాయలను వారి ఖాతాలో జమ చేసామని తెలిపారు.

యువతకు ఉపాధి, ఉద్యోగాలు 

ఈ రాష్ట్ర యువతే ప్రజా ప్రభుత్వ నిజమైన నిర్మాతలని వారి భవిష్యత్తుకు గ్యారెం టీ ఇస్తూ, యువత ఉపాధి, ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వైద్యరంగంలో, పోలీస్ శాఖలో నీటిపారుదల రంగంలో, సింగరేణి కాలరీస్ లో, ఇలా వివిధ రంగాలలో ఖాళీలను భర్తీచేస్తూ వ స్తుందని, ఉద్యోగ వయో పరిమితిని కూడా సడలించిందన్నారు.తెలంగాణ అవతరణ ది నోత్సవం వేడుకల్లో శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ , జిల్లా అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్,  జిల్లా అదనపు ఎస్పీ హనుమంతరావు, ఆర్డీవో వాసు చంద్ర, జిల్లా అధికారు లు పాల్గొన్నారు.

రాష్ట్ర అవతరణ వేడుకల్లో ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి 

మేడ్చల్, జూన్ 2 (విజయ క్రాంతి): అన్ని రంగాలలో దేశంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వం చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్య క్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగా ణ రైసింగ్ -2047 విజన్ తో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

ఈ విజన్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత వంటిదని, తెలంగాణ రూపురేఖలు మార్చేస్తుంద న్నారు. దేశంలో ఇతర రాష్ట్రాలు అమలు చే యని ఎన్నో సంక్షేమ పథకాలను మన రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తుందన్నా రు. జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలను వివరించారు. ఈ కార్యక్ర మంలో డిఆర్‌ఓ హరిప్రియ, కీసర ఆర్డీవో ఉ పేందర్ రెడ్డి, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిని జి కాంతమ్మ, కలెక్టరేట్ ఏవో  రామ్మో హన్, వ్యవసాయ శాఖ డి ఏ ఓ చంద్రకళ, డి ఈ ఓ విజయ కుమారి, యువజన సర్వీసుల శాఖ అధికారి గోపాల్, పౌరసరఫరాల శా ఖ డిఎం సుగుణ భాయి, డీఎస్‌ఓ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పోరాటాల ఫలితమే ప్రత్యేక తెలంగాణ : మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి 

మేడ్చల్, జూన్ 2 (విజయక్రాంతి): పో రాటాలు, త్యాగాల ఫలితం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందని మాజీ మంత్రి, మే డ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నా రు. సోమవారం రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా కేఎల్‌ఆర్ లోని జయశంకర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వివేకానంద చౌరస్తా, మున్సిపాలిటీ లో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.  మున్సిపాలిటీలో జరిగిన కార్యక్రమంలో వివిధ  పార్టీల నాయకులు పాల్గొన్నారు.

కమిషనర్ బి నాగిరెడ్డి, కాం గ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మర్రి దీపిక నరసింహారెడ్డి, పట్టణ కాం గ్రెస్ కమిటీ అధ్యక్షుడు వేముల శ్రీనివాసరెడ్డి, మాజీ కౌన్సిలర్లు  మల్లేష్ గౌడ్, కౌడే మ హేష్,  మాజీ ఉప సర్పంచ్ మర్రి నరసింహారెడ్డి, బీఆర్‌ఎస్ కు చెందిన భాస్కర్ యాదవ్, దయానంద్ యాదవ్, ఆకిటి నవీ న్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రవీందర్ రెడ్డి, రాజు కుమార్, బిజెపి పట్టణ అధ్యక్షురాలు శైలజ హరినాథ్, మాజీ సర్పంచ్ మురళీధర్ గుప్తా తదితరులు తెలంగాణ అవతరణ దినోత్సవంలో పాల్గొన్నారు.