17 గ్రామాల్లో స్త్రీశక్తి భవనాలు మంజూరు
12-03-2026 04:43 PM
స్థానిక ఎమ్మెల్యే మదమోహన్రావు చిత్రపటానికి పాలాభిషేకం
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని 17 గ్రామాలలో స్త్రీశక్తి భవనాలు మంజూరైనందున మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్మారెడ్డి గ్రామంలో గ్రామ మహిళలతో స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కృషితో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని,ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు మాధవి, ప్రధాన కార్యదర్శి దివిటి కిష్టయ్య, ఆయా గ్రామాల అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు,వివో సభ్యులు,సిఏలు,మహిళలు పాల్గొన్నారు.




