17 April, 2026 | 3:09 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఆకాశంలో బూడిద మేఘం

26-11-2025 12:26 AM
  1. విమాన సర్వీసులకు ఆటంకం కలుగుతుందని అంచనా
  2. సాయంత్రానికి భారత్‌ను వీడటంతో యథావిధిగా సర్వీసులు

న్యూఢిల్లీ, నవంబర్ 25: ఇథియోపియాలో హేలీగుబ్బి షీల్డ్ అగ్నిపర్వతం సోమవారం విస్ఫోటనం చెంది గాలిలోకి పెద్ద ఎత్తున బూడిద వెలువడింది. అది కాస్త పెద్ద మేఘంలా ఆకాశాన్ని దట్టంగా పట్టేసి మంగళవారం మధ్యాహ్నానికి గుమ్మటంలా తూర్పు వైపు కదులుతూ భారత్‌లోకి ప్రవేశించింది. ఆ ప్రభావం గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీపై కనిపించింది.

దీంతో విమాన సర్వీసులకు అంతరాయం కలుగుతుందని భారత వాతావరణశాఖ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అంచనా వేసింది. అయితే.. అనూహ్యంగా బూడిద మేఘం సాయంత్రానికి చైనా వైపు గమనాన్ని మార్చుకున్నది. రాత్రికి భారత గగనతలం నుంచి వెళ్లిపోయింది. దీంతో విమాన సర్వీసులకు ఎలాంటి అంతరాయం కలగలేదని, విమాన సర్వీసులన్నీ సజావుగా సాగాయని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది.