14 April, 2026 | 1:20 PM

Breaking News

అంబేడ్కర్‌కు నివాళులర్పించిన మధిర మార్కెట్ కమిటీ చైర్మన్   •   తల్లాడ పట్టణంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు   •   సోనాల మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   అంబేద్కర్ అసలు వారసులం మేమే   •   సామాజిక న్యాయం, సమానత్వం కోసమే అంబేద్కర్ ఆరాటం   •   కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   కేంద్ర నిబంధనలు పాటిస్తే... దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తారా?   •   బీఆర్ఎస్ పదేళ్ల విధ్వంసం— వందేళ్ల నష్టానికి దారి తీసింది   •   డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు సీఎం రేవంత్ ఘన నివాళి   •   ఒంగోలు దారుణ ఘటన: బతికుండగానే తల్లికి నిప్పు పెట్టిన కుమారుడు!   •  

సమైక్య భవనాలకు భూమి పూజ

14-02-2026 05:20 PM

పెంచికల్‌పేట్,(విజయక్రాంతి): పెంచికల్‌పేట్ మండలంలోని చేడ్వాయి గ్రామ పంచాయతీ, దరోగపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నూతన గ్రామ సమైక్య (వీవో) భవనాల నిర్మాణానికి శనివారం భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. చేడ్వాయి గ్రామ పంచాయతీలో వీవో భవనం, కొత్తగూడెంలో వీవో భవనాలు అలాగే వంట షెడ్ భవనాల నిర్మాణానికి మొత్తం రూ.22 లక్షల 50 వేల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను సర్పంచ్ చౌదరి శ్రీనివాస్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. దరోగపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ లక్ష్మి హరీష్ ఆధ్వర్యంలో వీవో గ్రామ సమైక్య భవనానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో  ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.