21-02-2026 03:52:21 PM
హైదరాబాద్: నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో(NTR Stadium) రైతుబడి అగ్రి షో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) రైతుబడి అగ్రిషోను సందర్శించారు. రైతులకు అగ్రి షో(Agri Show) ఎన్నోరకాలుగా దోహదపడుతోందని హరీశ్ రావు పేర్కొన్నారు. అగ్రిషో వంటి కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహిస్తే రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతను నివారించాలని కోరారు. రైతులకు ఆధునిక పరికరాలను సబ్సిడీపై ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాగు పనిముట్లకు రాయితీపై రైతుల పక్షాన అసెంబ్లీలో చర్చిస్తానని ఆయన హామీ ఇచ్చారు.