14-06-2025 12:21:56 AM
సాంకేతికలోపమే కారణమన్న వాయుసేన
పఠాన్కోట్, జూన్ 13: పంజాబ్లోని పఠాన్కోట్లో వాయుసేనకు చెందిన అటాక్ అపాచీ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. పఠాన్ కోట్ వైమానిక దళ కేంద్రం నుంచి బయల్దేరిన హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ముందు జాగ్రత్తగా నంగాల్పుర్ పరిధిలోని హాలెడ్ గ్రామంలో హెలికాప్టర్ను ల్యాండింగ్ చేసినట్టు వాయుసేన అధికారులు పేర్కొన్నారు.
అయితే దీనివల్ల ప్రజా భద్రత, మౌళిక సదుపాయాలకు ఎటువంటి ముప్పు లేదని తెలిపారు. పలువురు వైమానిక దళ అధికారులు, సాంకేతిక బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ప్రపంచలోనే అత్యుత్తమ హెలికాప్టర్గా అటాక్ అపాచీ పేరు తెచ్చుకొంది. 2015లో అమెరికాతో జరిగిన ఒప్పందంలో రూ. 13,952 కోట్లతో భారత్ హెలికాప్టర్లను కొనుగోలు చేసింది.