అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు
పూరి గుడిసెలను సందర్శించి లబ్ధిదారులను పరిశీలించిన తహసిల్దార్ ఖాజా మైనుద్దీన్.
వీపనగండ్ల: మండల కేంద్రంలోని పూరి గుడిసెలలో నివసిస్తున్న ఏడు మంది నిరుపేద కుటుంబాలను తహసిల్దార్ ఖాజా మైనుద్దీన్ గ్రామ సర్పంచ్ మీసాల పర్వతమ్మ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సొంత ఇంటి కలను సహకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి పారదర్శకంగా ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు పరిస్థితిని స్వయంగా పరిశీలించి వారి వివరాలను నమోదు చేశారు అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ నియబంధన ప్రకారం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సమ్మిరెడ్డి రవీందర్ రెడ్డి కావలి మహేష్ వార్డు సభ్యులు సుబ్రహ్మణ్యం చారి గ్రామపంచాయతీ కార్యదర్శి రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు






