14-06-2025 12:31:37 AM
థాయ్లాండ్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానం
న్యూఢిల్లీ, జూన్ 13: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీం తో థాయ్లాండ్ నుంచి న్యూఢిల్లీ వస్తు న్న వి మానాన్ని పైలట్ అత్యవసరంగా ల్యాండ్ చేశా రు. ఈ విషయాన్ని థాయ్లాండ్ విమానాశ్రయ అధికారులు ధృవీకరించారు. పుకెట్ విమానాశ్రయం నుంచి 156 మంది ప్రయాణికులతో కూడిన ఏఐ 379 విమానం ఢిల్లీకి బయల్దేరింది.
ఈ క్రమంలో బాంబు బెదిరిం పు రావడంతో అండమాన్ సముద్రంపైనే చా లాసేపు చక్కర్లు కొట్టింది. అనంతరం అధికారులు విమానాన్ని తిరిగి థాయ్లాండ్కు మ ళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే బాంబు బెదిరింపు ఎలా వచ్చిందనే విషయాన్ని అధికారులు ఇంకా వెల్లడించలేదు.