calender_icon.png 15 June, 2025 | 7:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు

14-06-2025 12:31:37 AM

థాయ్‌లాండ్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానం

న్యూఢిల్లీ, జూన్ 13: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీం తో థాయ్‌లాండ్ నుంచి న్యూఢిల్లీ వస్తు న్న వి మానాన్ని పైలట్ అత్యవసరంగా ల్యాండ్ చేశా రు. ఈ విషయాన్ని థాయ్‌లాండ్ విమానాశ్రయ అధికారులు ధృవీకరించారు. పుకెట్ విమానాశ్రయం నుంచి 156 మంది ప్రయాణికులతో కూడిన ఏఐ 379 విమానం ఢిల్లీకి బయల్దేరింది.

ఈ క్రమంలో బాంబు బెదిరిం పు రావడంతో అండమాన్ సముద్రంపైనే చా లాసేపు చక్కర్లు కొట్టింది. అనంతరం అధికారులు విమానాన్ని తిరిగి థాయ్‌లాండ్‌కు మ ళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే బాంబు బెదిరింపు ఎలా వచ్చిందనే విషయాన్ని అధికారులు ఇంకా వెల్లడించలేదు.