30-05-2025 03:27:37 AM
మేడ్చల్, మే 29 (విజయక్రాంతి): తన లేఖ ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన ఎమ్మెల్సీ కవిత.. సొంత పార్టీపైనే విమర్శలకు ఎక్కుపెడుతూ.. ముందుకు సాగుతున్నారు. కొన్ని రోజుల కింద కేసీఆర్ దేవడని, ఆయన చుట్టూ దెయ్యాలు చేరాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన కవిత, తాజాగా తన ఓటమికి సొం త పార్టీ నేతలే కారణమంటూ ఆరోపణలు చేశారు.
ఈ నేపథ్యంలో కవిత సొంత ఎజెండాతో ముందుకెళ్లేలా ఆలోచన లో ఉన్నారని, అందుకే బలగాన్ని తయారు చేసుకొనే పని లో పడ్డారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా గురువారం ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి ఫోన్ చేశారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధి, సేవాలాల్ తండాలోని సేవాలాల్ మహరాజ్ ఆలయ వార్షికోత్సవానికి తాను వస్తున్నాని చెప్పారు.
మల్లన్నా.. మీరు నాతో పాటు రావాలంటూ ఆహ్వానించా రు. ఆమె ఆహ్వానంతో వచ్చిన మల్లారెడ్డి కార్యక్రమంలో మాట్లాడుతూ.. కవిత బీఆర్ఎస్లోనే ఉన్నారని, ఆమెతో కలిసి ఏ కార్యక్రమంలోనూ పాల్గొనవద్దని పార్టీ తరఫున ఎలాంటి ఆదేశాలు రాలేవని పేర్కొన్నారు.