calender_icon.png 31 May, 2025 | 12:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐదు కమిటీలను ప్రకటించిన ఏఐసీసీ

30-05-2025 03:23:56 AM

  1. మీనాక్షినటరాజన్ నేతృత్వంలో రాజకీయ, సలహాదారు కమిటీలు 
  2. పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా మల్లు రవి 
  3. వెల్లడించిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ 

హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఐదు కమిటీలను ప్రకటించింది. ఈ మేరకు పార్టీ సంస్థాగత వ్యవ హారాల ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్ గురువారం ప్రకటించారు. 22 మందితో రాజకీ య వ్యవహారాల కమిటీ, 15 మందితో సలహాదారుల కమిటీతో పాటు 16 మందితో సంవిధాన్ బచావో కమిటీ, ఏడుగురితో డీలిమిటేషషన్ కమిటీ, ఆరుగురితో క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. రాజకీయ వ్యవహారాల కమిటీ, సలహాదారుల కమిటీకి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ చైర్‌పర్సన్‌గా వ్యవహారిస్తారు. 

రాజకీయ వ్యవహారాల కమిటీ..

మీనాక్షినటరాజన్ నేతృత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనరసింహ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, చల్లా వంశీచంద్‌రెడ్డి, రేణుకాచౌదరి, ఎంపీ బలరాంనాయక్, షబ్బీర్‌అలీ, అజారుద్దీన్, ఆది శ్రీనివాస్, వాకిటి శ్రీహరి ముదిరాజ్, బీర్ల ఐలయ్య, పీ సుదర్శన్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, జెట్టి కుసుమకుమార్, ఈరావత్రి అనిల్‌తో పాటు ఏఐసీసీ ఇన్‌చార్జి కార్యదర్శులు, ఏఐసీసీ కార్యదర్శుల, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులకు అవకాశం కల్పించారు. 

సలహాదారుల కమిటీ..

మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు, కే జానారెడ్డి, కే కేశవరావు, మధుయాష్కీగౌడ్, జీ చిన్నారెడ్డి, జే గీతారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, తూర్పు జగ్గారెడ్డి, జాఫర్ జావిద్, జీవన్‌రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, రాములు నాయక్ 

క్రమశిక్షణ కమిటీ.. 

పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా ఎంపీ మల్లు రవి, వైస్ చైర్మన్‌గా ఏ శ్యామమోహన్‌తో పాటు సభ్యులుగా ఎం నిరంజన్‌రెడ్డి, బీ కమలాకర్‌రావు, జాఫర్ జావిద్, జీవీ రామకృష్ణను నియమించింది. 

డీలిమిటేషన్ కమిటీలో సీడబ్ల్యూసీ సభ్యులు వంశీచంద్‌రెడ్డి అధ్యక్షతన ఆరుగురిని నియమించారు. ఇక సంవిధాన్ బచావో కార్యక్రమం కమిటీని పార్టీ సీనియర్ నేత పీ వినయ్‌కుమార్ నేతృత్వంలో 16 మందికి అవకాశం ఇచ్చారు.