07-06-2025 12:43:45 AM
మోతే, జూన్ 6:- పల్లెలపరివర్తనసొసైటీ ఆధ్వర్యంలోఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆలోచన పొండేషన్ చైర్మన్ మెలుగురి నాగరాజుకు సెంట్రల్ యూనివర్శిటీ డాక్టరేట్ ఇవ్వడంతో స్వచ్ఛంద సంస్థల కు దక్కిన గౌరవం అని పల్లెల పరివర్తన సొసైటీ చైర్మన్ లక్ష్మణ్ పల్లెల అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో జరిగిన సన్మానంలో సన్మాన గ్రహీత మెలుగురి నాగరాజు మాట్లాడుతూ సమాజ మార్పు కోసం పని చేస్తే ప్రతి పని ఒక గుర్తింపు లభిస్తుందని చెప్పారు.
అనేక అంశాల పట్ల అవగాహనతో పాటు విద్య వైద్యం పర్యావరణం సమతుల్యతతో పాటు కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో జయించడం జరిగిందని తెలిపారు. నేడు వ్యవస్థను పట్టి పీడిస్తున్న గంజాయి డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలనుపూర్తిగా నిషేధించాలని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నదని చెప్పారు.
నేడు వర్షాలు పడే సీజన్ కావడంతో ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి సంరక్షణ చేయాలనికోరారు. ఈ కార్యక్రమంలోసొసైటీ చైర్మన్ పల్లెల లక్ష్మణ్,వడ్డేరసంఘం మండల అధ్యక్షులు తురక వీరాస్వామి, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖఅధ్యక్షులు బొక్క ఉపేందర్ రెడ్డి, సొసైటీ ఎగ్జుక్యూట్ మెంబర్ పల్లెల రాము, గ్రామయూత్ నాయకులు జి.లింగరాజు, డి.ధనుంజయ్ దోసపాటి ఉపేందర్, క్రాంతి కుమార్, అప్పల దేవయ్య, వెంకటేష్, లింగా రెడ్డి, నర్సి రెడ్డి, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.