07-06-2025 12:44:26 AM
ఎల్లారెడ్డి జూన్ 6 (విజయక్రాంతి): ఎల్లారెడ్డి మండలంలో గత 20 సంవత్సరాల నుండి ఎల్లారెడ్డి నియోజకవర్గ పేదలు సొంత ఇంటి కల కలగనే మిగిలిపోయింది. గత ప్రభుత్వ పాలకుల అసమర్థ పాలన వల్ల ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదు.
కానీ కాంగ్రెస్, పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల వ్యవధిలోనే నియోజకవర్గానికి 3500 డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు అయ్యాయి. అందులో భాగంగా,శుక్రవారం ఎల్లారెడ్డి మండలం ధాల్మాల్కపల్లి గ్రామము ఇందిరమ్మ ఇండ్ల ఇంటికి నిర్మాణానికి భూమి చేసిన పేదల ఇంటి కలను సాకారం చేసే దిశగా ముందడుగు వేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రజలకు సొంత ఇంటి ఉండడం ఒక కల. ప్రజలు అందరు తమకు సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటారు. సొంత ఇంటి నిర్మాణం కొరకు భూమి పూజ చేసినందుకు చాల సంతోషంగా ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ధాల్మాల్కపల్లి గ్రామ అధ్యక్షులు రాంచందర్ పటేల్, గణేష్, సాయిబాబా గౌడ్ మరియు గ్రామ సెక్రటరీ మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు.