24 March, 2026 | 8:33 PM

Breaking News

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన   •   జన గణనను పకడ్బందీగా పూర్తి చేయాలి   •   ప్రభుత్వానికి నాణ్యమైన సమాచారం అందించేలా కృషి చేయాలి   •   ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు   •   సంత నిర్వాహణ వేలంలో పెరిగిన ఆదాయం 5.02 శాతం మాత్రమే   •   జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం   •   ద్వారకుంటలో సిసి రోడ్డు శంకుస్థాపన: సర్పంచ్ పాలకి సురేష్   •   ఖైదీలకు బెయిల్ విషయంలో సహాయం చేయడమే సాధికార కమిటీ ఉద్దేశ్యం   •   కోనరావుపేట 10వ వార్డ్‌లో పారిశుధ్య సమస్యలు   •   కోదండరామాలయం పరిసరాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు   •  

అనేక ప్రజా ఉద్యమాలను నిర్మించిన పార్టీ సిపిఐ

18-04-2025 09:50 PM

పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కృషి చేస్తాము

సిపిఐ పార్టీలో భారీ చేరికలు

సీపీఐ జాతీయ సమితి సభ్యులు పల్ల వెంకట్ రెడ్డి,ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

మునుగోడు,(విజయక్రాంతి): అణగారిన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా కష్టజీవుల కోసం అనేక ప్రజా ఉద్యమాలు నిర్మించిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని సీపీఐ జాతీయ సమితి సభ్యులు పల్ల వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పేర్కొన్నారు. సిపిఐ ప్రజా పోరాటాలకు ఆకర్షితులై మునుగోడు మండలంలోని కిష్టాపురం, చీకటి మామిడి, రావి గూడెం గ్రామాలకు చెందిన సుమారు 50 మంది యువకులకు కండువాలు కప్పి సిపిఐ పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. కార్మికుల కర్షకుల హక్కుల కోసం 100 సంవత్సరాల కాలంగా పోరాడిన చరిత్ర సిపిఐదని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సిపిఐ పాటుపడుతుందని అన్నారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి సాగు త్రాగునీరు అందించేంతవరకు కృషి చేస్తానని ఈ సందర్భంగా అన్నారు.