26 February, 2026 | 10:00 PM

డీజీగా పదోన్నతి పొందిన హైదరాబాద్ సీపీ

08-08-2024 09:22 PM

ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతికుమారి

హైదరాబాద్: రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు 1994 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, హైదరాబాద్ పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డికి డీజీగా పదోన్నతి లభించింది. ప్రస్తుతానికి ఆయన హైదరాబాద్ సీపీగానే కొనసాగుతారని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొంది.