15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా దీపా నర్సింలు నియామకం

26-02-2026 03:15 PM

ప్రజా సమస్యలు తీరుస్తూ..ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఎండగట్టండి..మాజీ ఎమ్మెల్యే. 

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా దీప నర్సింలను నియమిస్తూ తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నియామక పత్రం అందజేశారు. గురువారం రోహిత్ రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ లతో సమావేశం నిర్వహించారు. మున్సిపల్ వ్యవహారాల్లో అవగాహన ఉన్న తొమ్మిదవ వార్డ్ కౌన్సిలర్ దీప నర్సింలు నియమిస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ..నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తూ... కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను కౌన్సిల్లో కౌన్సిలర్లు అంతా ఎప్పటికప్పుడు ఎండగట్టాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, రాజు గౌడ్, పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి  నూతన కౌన్సిలర్లు నాగలక్ష్మి అనంత్ రెడ్డి, బి అనిల్ కుమార్, ఎండి ఇర్షాద్, ఎండి జావిద్,  సురేష్ నాయక్, నవీన సంతోష్ గౌడ్, నసీరాబాను , అవుసుల యోగానంద్, మహేశ్వరి, సుప్రీత , రూప తదితరులు పాల్గొన్నారు.