15 April, 2026 | 12:38 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

రాతిలో సంగీతం.. స్తంభాల్లో ప్రతి ధ్వని

03-02-2026 08:46 PM

ఇండియన్ ఆడిట్, అకౌంట్స్ సర్వీస్ అధికారి అఖిల్

వెంకటాపూర్,(విజయక్రాంతి): మండలంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన ప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ అధికారి అఖిల్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి కుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. కాకతీయుల కాలంలో నిర్మితమైన ఈ అద్భుత శిల్పకళా సౌందర్యాన్ని ఆయన ఆసక్తిగా తిలకించారు.

ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ శైలి, శిల్పాల నైపుణ్యం, దేవాలయ గర్భగృహం, స్తంభాలపై చెక్కిన సున్నితమైన శిల్పాలు, నర్తకీ మణులు, శబ్ద స్తంభాలు వంటి విశేషాలను టూరిజం గైడ్ తాడబోయిన వెంకటేష్ విపులంగా వివరించారు. రామప్ప దేవాలయం ఎందుకు ప్రపంచ ఖ్యాతిని పొందిందో, కాకతీయుల వాస్తు శాస్త్ర ప్రతిభ ఏ స్థాయిలో ఉందో తన వివరణ ద్వారా తెలియజేశారు. పర్యటన మొత్తం సమయంలో టూరిస్టు పోలీసులు అరుణ్ కుమార్, శ్రీనివాస్ భద్రతా ఏర్పాట్లతో పాటు పర్యాటక నిర్వహణను సమర్థవంతంగా పర్యవేక్షించారు. రామప్ప దేవాలయాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన అఖిల్, ఆలయ శిల్పకళ అద్భుతమని, భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ఇది ప్రతీకగా నిలుస్తుందని ప్రశంసలు వ్యక్తం చేశారు.