02-06-2025 07:48:39 PM
ఈ ఏడాది భారత్, శ్రీలంక వేదికగా మహిళల వన్డే ప్రపంచకప్ 13వ ఎడిషన్ జరగనుంది. మహిళల వన్డే ప్రపంచకప్ షెడ్యూల్, వేదికలు, తేదీలను తాజాగా షెడ్యూల్ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (International Cricket Council) అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు భారత్, శ్రీలంకలోని ఐదు వేదికల్లో మహిళల వన్డే ప్రపంచకప్ మ్యాచ్ లు నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో భారత్ సహా 8 జట్లు పాల్గొననున్నాయి. ఈ మహిళల వన్డే ప్రపంచకప్ మ్యాచ్ లకు భారత్ లో చిన్నస్వామి(బెంగళూరు), ఏసీఏ(గువాహటి), హోల్కర్(ఇందౌర్), ఏసీఏ-వీడీసీఏ(విశాఖపట్నం), శ్రీలంకలోని ఆర్.ప్రేమదాస(కొలంబో) మైదానాలు ఆతిథ్యం వహించనున్నాయి. అక్టోబర్ 29వ తేదీన గువాహటి లేదా కొలంబోలో మహిళల వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్-1 మ్యాచ్, అక్టోబర్ 30న బెంగళూరులో సెమీఫైనల్-2 మ్యాచ్, నవంబర్ 2వ తేదీన జరిగే ఫైనల్ మ్యాచ్ కు బెంగళూరు లేదా కొలంబో అతిథ్యమివ్వనుంది. అయితే, ఈ టోర్ని మ్యాచ్ లకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల కానుంది.