calender_icon.png 6 June, 2025 | 8:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవంబర్ 2న ఫైనల్

03-06-2025 12:00:00 AM

2025 మహిళల వన్డే ప్రపంచకప్ మ్యాచ్ వేదికలు, తేదీలు ఖరారు

దుబాయ్, జూన్ 2: ఈ ఏడాది భారత్, శ్రీలంక వేదికగా మహిళల వన్డే ప్రపంచకప్ జరగనుంది. మ్యాచ్‌లకు సంబంధించిన వేదికలు, తేదీలను ఐసీసీ సోమవారం ఖరారు చేసింది. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు ఐదు వేదికల్లో ఈ టోర్నీ జరగనుంది. చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు), గుహవాటిలోని ఏసీఏ స్టేడియం, ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం, విశాఖపట్నంలోని ఏసీఏ కొలంబోలోని ప్రేమదాస మ్యా చ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

సెప్టెంబర్ 30న బెంగళూరు వేదికగా భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 29న తొలి సెమీఫైనల్ గుహవాటి లేదా కొలంబో, రెండో సెమీఫైనల్ అక్టోబర్ 30న బెంగళూరులో జరగనుంది. నవంబర్ 2న జరిగే ఫైనల్‌కు బెంగళూరు లేదా కొలంబో ఆతిథ్యమివ్వనుంది.