15 June, 2026 | 9:56 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

పోడు రైతులను ఇబ్బంది పెడితే ఉద్యమం తప్పదు

22-03-2025 07:31 PM

మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఎన్నో ఏళ్లుగా రైతులు సాగు చేస్తున్న పోడు భూములు ,  ఊర్లలో సాగు, తాగు నీటి కోసం బోర్లు వేయకుండా అడ్డుపడితే ఉద్యమం తప్పదని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప స్పష్టం చేశారు. శనివారం బెజ్జుర్ మండలంలోని వివిధ గ్రామాల పోడు రైతులతో కలసి ఫారెస్ట్ రేంజ్ అఫీస్ వద్దకు చేరుకొని కాగజ్ నగర్ డీఎస్పీ రామానుజం(Kagaznagar DSP Ramanujam), ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లతో మాట్లాడారు. ఫారెస్ట్ ఆఫీసర్లు ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా  సహకరించాలని కోరారు. బోరు, బావులకి అనుమతులు ఇవ్వాలని, తాతాల కాలం నుండి సాగు చేసుకుంటూ వస్తున్న  పోడు భూములకు అడ్డు చెప్పొద్దని, కొత్తగా అటవీ భూముల జోలికి వెళ్తే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో  ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఆదేశాలు ఇవ్వాలని, లేని పక్షంలో వచ్చే నెల 5న వేల మంది రైతులతో  బెజ్జూర్ ఫారెస్ట్ కార్యాలయం ముందు మహా ధర్నా చేస్తామని స్పష్టం చేశారు.