14-06-2025 12:26:30 AM
శ్రావణ బోయిన నరసయ్య
భద్రాద్రి కొత్తగూడెం జూన్ 13 (విజయ క్రాంతి)తెలంగాణ రాష్ట్ర సాధనకై ఉద్యమించిన ఉద్యమకారులను విస్మరించిన పాలకు లు ఇంటికి పరిమితం కావడం తధ్యమని తొలి, మలి తెలంగాణ ఉద్యమ నాయకులు శ్రావణ బోయిన నరసయ్య స్పష్టం చేశారు.
శుక్రవారం విలేకరులతో మా ట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకై 1969 నుంచి 2014 వరకు అహర్నిశలు అలుపెరగని పోరాటంలో అనేక కష్టాలను నష్టాలను అవమానాలను ఆపదలను లాటేదెబ్బలను చీకటి జైలకు పాలైన ఉద్యమకారులను విస్మరించిన గత పాలకులు ఇంటికే పరిమిత మయ్యారన్నారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని సత్వరమే ఉద్యమకారులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధానంగా ఉద్యమకారులకు పెన్షన్ సౌకర్యం, 250 గజాల ఇంటి స్థలం తో పాటు ఇంటి నిర్మాణం, మెరుగైన ఉచిత కార్పొరేట్ వైద్య సౌకర్యం, ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు కూచన కృష్ణారావు, డాక్టర్ రామ్మూర్తి, కాంపల్లి సైమాన్, ఎం వలి బాబు, సత్తార్ బ్యాగ్ తదితరులు పాల్గొన్నారు.