calender_icon.png 14 June, 2025 | 5:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఎన్నికల్లో కుటుంబ నియంత్రణ విధానాన్ని తీసివేయాలి

14-06-2025 12:27:37 AM

బిజెపి మండల అధ్యక్షులు ఎల్లారెడ్డి

చేగుంట,(విజయక్రాంతి): చేగుంట బిజెపి అధ్యక్షులు దొంతి రెడ్డి ఎల్లారెడ్డి శుక్రవారం రోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వచ్చే స్థానిక సంస్థల, ఎన్నికలలో ఇద్దరు సంతానం కంటే ఎక్కువ ఉండరాదు అనే నిబంధనను తీసివేయాలి. ఈ నిబందనతో ఎంతో మంది నాయకులు ప్రజలు ఓకరు లేక ఇద్దరుతో సరి పెట్టుకుంటున్నారు. ఇప్పటి కే బందుత్వ,వరుసలు, కనుమరుగయ్యే పరిస్థితి కి వచ్చింది.

సంతానం ఉత్పత్తి తగ్గడంతో పెండ్లిలు, కూడ కావడం లేదు ఎంతో మంది యువతి యువకులు వయస్సు పై బడి పెండ్లి ల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నిబందన ప్రభుత్వ ఉద్యోగానికి, ప్రభుత్వం ఇచ్చే రాయితీలకు గాని లేని,ఈ సంతాన నిబందన ఎన్నికల లొ పోటి చేసే వారికి ఎందుకు వర్తించాలి, ఈ నిబంధన గురించి ఇటు ప్రభుత్వాలు, కానీ ఎన్నికల కమిషన్ గాని, అలోచించి ఇట్టి నిబంధనను తొలగించాలని చెగుంట భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరుపున, మండల పార్టీ అధ్యక్షుడు దొంత్తిరెడ్డి ఎల్లారెడ్డి  డిమాండ్ చేసారు.