14-06-2025 12:26:04 AM
హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): ప్రజా గాయకుడు గద్దర్ను కాంగ్రెస్ ప్రభు త్వం అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత శుక్రవారం ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రతీ సందర్భంలో గద్దర్ పేరును జపం చేసే కాంగ్రెస్ సర్కార్.. వారి పేరు మీద ఇస్తున్నటు సినీ అవార్డుల ఆహ్వానపత్రికలో గద్దర్ పేరు లేకపోవటం బాధాకరమ న్నారు. కనీసం అవార్డుల పంపిణీ కార్యక్రమంలోనైనా వారి చిత్రపటాన్ని పెట్టి గౌరవిం చాలని కోరారు.