calender_icon.png 27 June, 2025 | 7:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీసా చట్టాలను పాతర

27-06-2025 01:56:06 PM

  1. రూ100కోట్ల ఇసుక అక్రమాలు
  2. కొందరికె ఆదివాసీ లబ్ది  
  3. అత్యధిక ఆదివాసీల అభివృద్ధి సంగతేంటి?
  4. పర్యావరణ విధ్వంసం ఆదివాసీ చట్టాల పాతరేసే కుట్ర మానుకోవాలి 
  5. మంత్రి సీతక్క గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యటించాలి. ఉపాధికి దూరమైన ప్రజల గోడు వినాలి 
  6. ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ ఇరప.రాజు 

చర్ల, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా చర్ల మండలంలో ఆదివాసీ ప్రజల జీవన మనుగడకు కీలకమైన ఆదివాసీ చట్టాలను పాతరేసి ఇసుక అక్రమాలకు తెరలేపిన ప్రజా ప్రతినిధులకు, అధికారులకు తగిన బుద్ధి చెప్పాలని ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ ఇరప.రాజు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ  ఆదివాసీ చట్టాలను సమాది చేసి షెడ్యూల్డ్ ట్రైబల్ (ST) నియోజకవర్గాన్ని జనరల్ చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అందులో భాగంగానే పీసా గ్రామసభలు, పీసా కమిటీలను, 1/70, ఎల్టిఆర్ చట్టాలను పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఆదివాసీ సంపద అయినా ఇసుకను ఆంధ్ర కాంట్రాక్టర్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టబెట్టిందని ఆరోపించారు. అందులో బాగంగానే రూ 1000 కోట్ల  ఇసుక అక్రమాలు చర్ల మండలంలో జరుగుతున్నాయన్నారు. ఆదివాసీ సమాజం ఈ విషయాన్ని నిశితంగా గమనించాలని కోరారు. వెయ్యి మన జేబులో పెట్టి పది వేలు రైజింగ్ కాంట్రాక్టర్ ముసుగులో ఉన్న వ్యక్తులు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇందుకు కొందరి ఆదివాసీ ప్రజల అభివృద్ధిగా చూపెడుతూ అందరి అభివృద్ధి చిత్రికరిస్తున్నారని అన్నారు..

మంత్రి సీతక్క గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యటించాలి

ఆదివాసీ ఆడబిడ్డ తెలంగాణ రాష్ట్ర మంత్రి ములుగు ఎమ్మెల్యే సీతక్క గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యటించాలనీ డిమాండ్ చేశారు. ఆదివాసీ చట్టాలు ఏ రకంగా విధ్వంసం అవుతున్నాయో కనులారా వీక్షించవచన్నారు. ఆదివాసీ సమాజం గోడు వీనే అదృష్టం సైతం వరిస్తోందన్నారు.. లేదని ఆదివాసీ ప్రజలకు అన్యాయం చేసిన వ్యక్తిగా మిగిలి పోవాల్సి వస్తుందని అన్నారు. త్వరలోనే ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక వేదిక ఆధ్వర్యంలో రాష్ట్రంలో గల ఆదివాసీ ఎమ్మెల్యేలను కలిసి భద్రాచలం నియోజకవర్గంలో జరుగుతున్న ఆదివాసీ చట్టాల ఉల్లంఘన గురించి వివరిస్తామని తదనంతరం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి వివరిస్తామని వెల్లడించారు.