calender_icon.png 24 June, 2025 | 3:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లెందు మున్సిపాలిటీ అస్తవ్యస్తం

24-06-2025 12:16:35 AM

సమస్యలు పరిష్కరించాలంటూ బీఆర్ ఎస్ ధర్నా 

ఇల్లెందు, జూన్ 23 (విజయక్రాంతి):ఇల్లందు మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలపై, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మున్సిపల్ కార్యాలయాల ఎదుట సోమవారం బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా పార్టీ పిలుపు మేరకు ఇల్లందు నియోజకవర్గ మాజీ ఎ మ్మెల్యే, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బానోత్ హరిప్రియ, భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక సభ్యులు దిండిగాల రాజేందర్, భారత రాష్ట్ర సమితి ఇల్లందు పట్టణ కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులతో కలిసి మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు.

అనంతరం మున్సిపల్ మేనేజర్ అంకు షావలికి సమస్యల పరిష్కార దిశగా కృషి చేయాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రాన్ని అందజేశారు.కార్యక్రమంలో సిలివేరి సత్యనారాయ ణ, మాజీ కౌన్సిలర్ జెకె శ్రీను, ఎస్ రంగనాథ్, ఇల్లందు పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వర్ రావు, ఇల్లందు పట్టణ ఉపాధ్యక్షుడు అబ్దుల్ నబీ, మహమ్మద్ అబ్దుల్ జబ్బార్, సోషల్ మీడియా, యువజన విభాగం గిన్నారపు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.