calender_icon.png 24 June, 2025 | 9:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయాలి

24-06-2025 12:16:41 AM

కొత్తకోట జూన్ 23 : బిసిలకు 42% శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా 42% రిజర్వేషన్ అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళ్లాలని బిసి కుల సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ రాములు యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం కొత్తకోట తహసీల్దార్ కార్యాలయం దగ్గర తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ బిసిలకు 42 % రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలనీ డిమాండ్ చేశారు. అలాగే విద్యా, ఉద్యోగాల్లో కూడా ఈ రిజర్వేషన్ అమలు చేయాలనీ కోరారు. అసెంబ్లీలో బిసి రిజర్వేషన్ అమలుకు మద్దతు తెలిపి ఇప్పుడు బిసిల రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోయే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఈ విదంగా జరిగితే రాష్టంలో బిసిలంతా ఏకమై ఉద్యమాన్ని చేపడుతమని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో గౌనికాడి రాములు యాదవ్, మాజీ వార్డు సభ్యులు వెంకటన్న గౌడ్, సంద రామచంద్రయ్య, తిరుపతయ్య గౌడ్, హోటల్ కురువన్న, జహంగీర్, నజీర్, ఊసన్న తదితరులు పాల్గొన్నారు.