calender_icon.png 2 June, 2025 | 3:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతన చట్టం అమలు

10-05-2025 11:21:04 PM

సీఐటీయూ జిల్లా నాయకులు సత్రపల్లి సాంబశివరావు

మణుగూరు,(విజయక్రాంతి): పలు ప్రైవేట్, ప్రభుత్వ రంగాలలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేయాలని, ఆ యాప్ కంపెనీల యాజమాన్యాలకు సమ్మె  నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు సత్రపల్లి సాంబశివరావు మాట్లాడుతూ... మే 20 నా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేకమైన విధానాలను అవలంబిస్తున్నది. ప్రజలను మతముస్కులో ముంచి ప్రజలపై అధిక భారం మోపుతున్నదని విమర్శించారు.

కార్మికులు అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాచి పెట్టుబడిదారులకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడలను తీసుకొచ్చిందని వెంటనే లేబర్ కోడులను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేస్తున్న మే 20 సార్వత్రిక సమ్మెను పారిశ్రామిక కార్మికులు అసంఘటిత కార్మికులు రైతాంగము వ్యవసాయ కూలీలు సమస్త పేద ప్రజానీకం పాల్గొని జయప్రదం. చేయాలనికోరారు. ఈ కార్యక్రమంలో హేమంత్ రావ్. బి టీ పి ఎస్ సంఘం ఉపాధ్యక్షులు  ఎగ్గడి రవి  . బిక్షపతి. శ్రీను. రమేష్. లారీ అసోసియేషన్ డ్రైవర్స్  యూనియన్ ప్రెసిడెంట్. సాంబయ్య.సతీష్. హోండా హీరో షోరూం కార్మికులు    తదితరులు పాల్గొన్నారు.