15 June, 2026 | 11:12 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

రష్యాకు వీసా రహిత ప్రయాణం

29-10-2024 12:26 AM

త్వరలో భారతీయులకు అవకాశం!

న్యూఢిల్లీ, అక్టోబర్ 28: భారతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు రష్యా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా వీసా లేకుండానే తమ దేశ పర్యటనకు అనుమతి ఇచ్చే అంశంపై కొంతకాలంగా రష్యా చర్చలు జరుపుతోంది. తాజాగా ఇందుకు సంబంధించిన ఒప్పందాలు కీలకదశకు చేరుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 2025 స్ప్రింగ్ సీజన్ నుంచి వీసా సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు రష్యాకు చెందిన ఉన్నతాధికారి ధ్రువీకరించారు.

ఈ ఒప్పందానికి ఆమోదం లభిస్తే భారత్ నుంచి పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు మాస్కో సిటీ టూరిజం కమిటీ చైర్మన్ ఎవ్జెనీ కోజ్లోవ్ వెల్లడించారు. గతేడాది ఆగస్టు 1 నుంచి భారత్ నుంచి రష్యా వెళ్లే ప్రయాణికుల కోసం రష్యా.. ఈ దరఖాస్తు చేసుకునే (నాలుగు రోజుల్లో జారీ అవుతుంది) వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. మొత్తంగా గతేడాది 9,500 మంది భారత పర్యాటకులకు ఈ జారీఅయ్యాయి.