13 March, 2026 | 9:20 PM

స్మశాన వాటికలో మౌలిక వసతులు

13-03-2026 07:13 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆయా స్మశాన వాటికలో ప్రజల అవసరాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. పట్టణంలోని మంచిర్యాల చౌరస్తా, బైల్ బజార్ స్మశాన వాటిక పరిశీలించి అక్కడ చేపట్టవలసిన పనులపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. నీటి సౌకర్యం రోడ్డు గద్దెలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపి ఎస్పి రాజు, ధర్మాజీ శ్రీనివాస్ పోశెట్టి ధర్మాజీ రాజేందర్ కడప శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.