17 April, 2026 | 3:10 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

బీఆర్ఎస్ కార్యకర్తల సంక్షేమానికి పార్టీ కృషి

29-03-2025 04:57 PM

కార్యకర్తలు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి అండగా ఉంటుంది

సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

సంగారెడ్డి,(విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉండేందుకు సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరికి బీమా సౌకర్యం కల్పించడం జరిగిందని సంగారెడ్డి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చింతా ప్రభాకర్ తెలిపారు. శనివారం సంగారెడ్డి క్యాంపు కార్యాలయంలో కొండాపూర్ మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన ఎల్లారం ముత్తయ్య ప్రమాదవశాత్తు మృతి చెందగా, బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరపున రెండు లక్షల చెక్కును అందజేశారు.

దేశంలో ఎక్కడ లేని విధంగా పార్టీ స‌భ్య‌త్వం క‌లిగిన బీఆర్ఎస్ ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణిస్తే రెండు లక్షల సహాయం అందిస్తూ అండగా ఉంటుందని  స్పష్టం చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు కేసీఆర్  పార్టీ సభ్యత్వం కలిగిన కార్యకర్తలకు ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే వారి కుటుంబానికి అండగా ఉండటానికి  ప్రమాద భీమా సౌకర్యం కల్పించారన్నారు. కేసీఆర్, కేసీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గార్లకు బాధిత కుటుంబా సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.