10-09-2024 03:23:19 AM
ట్రోఫీ అందజేసిన సీఎం రేవంత్
హైదరాబాద్: గచ్చిబౌలి వేదికగా జరిగిన ఇంటర్కాంటినెంటల్ ఫుట్బాల్ టోర్నీలో సిరియా విజేతగా నిలిచింది. సోమవారం భారత్తో జరిగిన చివరి మ్యాచ్లో సిరియా 3 విజయాన్ని నమోదు చేసింది. సిరియా తరఫున అస్వద్ (ఆట 7వ నిమిషంలో), ఇరాన్డస్ట్ ( 76వ ని.లో), పాబ్లో సబాగ్ 90+6వ ని.లో) గోల్స్ సాధించారు. ఈ ఓటమితో భారత్ పట్టికలో మూడో స్థానంలో నిలవగా.. మారిషస్ రెండో స్థానంలో ఉంది. ఆడిన రెండింటిలోనూ విజయాలు అందుకున్న సిరియా కప్ను కైవసం చేసుకుంది. కాగా టోర్నీ ముగింపు కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. విజేతగా నిలిచిన సిరియాను అభినందించిన రేవంత్ జట్టుకు ట్రోఫీతో పాటు చెక్ను బహుకరించారు.