10-09-2024 03:22:16 AM
సౌరవ్ గంగూలీ
కోల్కతా: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ టెస్టుల్లో ఆల్ టైమ్ గ్రేట్ అయ్యే అర్హత ఉన్నట్లు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. అయితే పంత్ టీ20ల్లో మరింత మెరుగవ్వాల్సిన అవసరముందని పేర్కొన్నాడు. బంగ్లా తో ఆరంభం కాబోయే మొదటి టెస్టు కోసం ప్రకటించిన జట్టులో పంత్కు చోటు దక్కిం ది. రెండేళ్ల క్రితం ఘోర రోడ్డు ప్రమాదం తర్వాత ప్రమాదం నుంచి కోలుకున్న పంత్ టీమిండియా తరఫున టెస్టు క్రికెట్ ఆడడం ఇదే తొలిసారి. ‘భారత్ గొప్ప టెస్టు బ్యాటర్లలో పంత్ ఒకడనే విషయంలో నాకు ఎటువంటి అనుమానం లేదు. పంత్కు మళ్లీ జట్టులో చోటు దక్కడం నాకు ఏమీ ఆశ్చర్యం కలిగించలేదు. అతడు ఇలాగే ఆడితే టెస్టుల్లో ఆల్ టైమ్ గ్రేట్గా అవతరిస్తాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నన్ను అడిగితే అతడు టీ20ల్లోనే మరింత మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. అతడికి ఉన్న టాలెంట్కు తప్పకుండా గ్రేట్ క్రికెటర్ అవుతాడు’ అని దాదా అభిప్రాయపడ్డాడు.