calender_icon.png 21 June, 2025 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పతకవీరులకు అభినందనలు: గోపిచంద్

10-09-2024 03:26:27 AM

హైదరాబాద్: పారాలింపిక్స్‌లో పతకాలతో సత్తా చాటిన భారత అథ్లెట్లను బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపిచంద్ ప్రత్యేకంగా అభినందించారు. సోమవారం గచ్చిబౌలిలో సాయి గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఏర్పాటు చేసిన క్రీడాకారుల అభినందన కార్యక్రమానికి గోపిచంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పారాలింపిక్స్‌లో 400 మీటర్ల టీ20 ఈవెంట్‌లో  కాంస్యం సాధించిన తెలంగాణ అథ్లెట్ దీప్తి జివాంజీతో పాటు పురుషుల సింగిల్స్ ఎస్ ఎల్ 3 కేటగిరీలో స్వర్ణం సాధించిన నితీశ్‌కుమార్, మహిళల సింగిల్స్ ఎస్ యు 5లో రజతం సాధించిన తులసిమతిని అభినందించారు. ఈ సందర్భంగా గోపిచంద్ మాట్లాడుతూ.. ‘విశ్వవేదికపై సత్తా చాటిన అథ్లెట్లను కచ్చితంగా గౌరవించి వారికి మరింత ప్రోత్సాహమిస్తాం. జీవితంలో ఎన్నో ఒడిదొడుకుల ఎదుర్కొని మానసిక స్థుర్యైన్ని పెంచుకొని మెరుగైన ఫలితాలు సాధించడం ఎంతో గర్వంగా ఉంది’ అని తెలిపారు. కార్యక్రమంలో అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్‌తో పాటు బ్యాడ్మింటన్ కోచ్‌లు సహా తదితరులు పాల్గొన్నారు.