18-06-2025 12:00:00 AM
- కరీంనగర్ జిల్లాలో రూ.139 కోట్లు విడుదల
- హర్షం వ్యక్త చేస్తున్న రైతులు
కరీంనగర్, జూన్ 17 (విజయ క్రాంతి): రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పెట్టుబడి సహాయం విడుదలయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి లాంఛనంగా ప్రారంభించగా మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో సాయం చేరుతోంది. గత పట్టాదారుల సంఖ్యతో పాటు కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులకు కూడా రైతు భరోసా వర్తింపజేశారు. గతంలో మాదిరి చిన్న, సన్నకారు రైతులను కాకుండా అందరి ఖాతాలకు రైతు భరోసా సాయం అందనుంది.
తొమ్మిది రోజుల్లో సాయం మొత్తం రైతుల ఖాతాల్లో జమ కానుంది. గత యాసంగి సీజన్ కు సంబంధించిన 4 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా సాయం అందింది. ఈసారి అందరు రైతులకు సాయం అందనుంది. ఖరీఫ్ సీజన్ కు రైతులు నార్లు పోసుకుని సిద్ధమవుతన్న తరుణంలో సకాలంలో సాయం అందుతుండ డంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 5 వరకు ఆన్లైన్లో నమోదైన వారందరికీ సాయం అందనుంది. జిల్లాలో 77 వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో ఏఈవో, రెవె న్యూ అధికారి సంయుక్తంగా సర్వే చేపట్టి 5,608 ఎకరాల భూమి పనికిరాదని తేల్చారు.
నాన్ అగ్రికల్చర్ ల్యాండ్, పలు స్థలాలు రాళ్లు, రప్పలు, గ్రానైట్ క్వారీలు తదితర ఉన్నాయని గుర్తించారు. జిల్లాలో 206 రెవెన్యూ గ్రామాలు ఉండగా 2,10,904 మంది పట్టాదారులకు 211.90 కోట్ల రూపాయల నగదు విడుదల కావాల్సి ఉంది. 1,94,184 మంది రైతులు తమ ఖాతాలు ఇవ్వగా, 139.08 కోట్ల రూపాయలు ట్రెజరీకి చేరింది. 1,68,218 మంది రైతులు లబ్దిపొందనున్నారు. ఇప్పటివరకు 1,52,034 మంది రైతులకువిడుదల చేసిన మొత్తం రూ.106,05,11,225 జమయ్యా యి.
అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతు భరోసా కింద 76,974 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 43 కోట్ల 22 లక్షల 42,659 రూపాయలు జమయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో 1,01,528 మంది రైతులకు 54 కోట్ల 77 లక్షల 52,170 రూపాయలు, జగిత్యాల జిల్లాలో 1,49,494 మంది రైతుల ఖాకాల్లో 76 కోట్ల 66,810 రూపాయలు జమయ్యాయి. ఖరీఫ్ సీజను రైతులు నార్లు పోసుకుని సిద్ధమవుతున్న సమయంలో రైతు భరోసా డబ్బులు పడుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
టైంకు పైసలేసిండు...
నేను చిన్న, సన్నకారు రైతును ఇదివరకు సాగు పెట్టుబడికి ఏ పావుకారు దగ్గరో వడ్డీకి పైసలు తెచ్చి సాగు చేసేవాడిని. కానీ ఈసారి వానాకాలం సాగుకు ముందే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైతుల ఖాతాల్లో పెట్టుబది పైసలు వేసిండు. నాకు కూడా ఎకరా 10 గుంటలకు 7500 రూపాయ లు ఖాతాల్లో పడ్డాయి. ఈ పైసలతో విత్తనాలు, మందులు కొని సాగు మొదలు పెదతా, టైంకు పెట్టుబడి పైనలిచ్చిన ముఖ్యమంత్రి కిరుణపఉంటా.
ఐరెడ్డి చంద్రారెడ్డి, లంబాడిపల్లి, చిగురుమామిడి మండలం
రైతు భరోసా ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది
రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం ప్రవేశపెట్టి రైతుల ఎకౌంట్లో డబ్బులు వేయడంతో తాము వ్యవసాయం చేసుకోవడానికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందని రైతు భరోసాతో నిజమైందని, తమకు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, ఎకౌంట్లో సోమవారం రాత్రి భరోసా డబ్బులు రావటంతో ఎరువుల మందులు కొనుగోలు చేశామని, దీంతో తమకు ఎంతో మేలు జరిగింది.
మైదం వరప్రసాద్ , ఆదివారంపేట