calender_icon.png 18 June, 2025 | 1:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ యాజమాన్య వివరాలతో రెవెన్యూ విలేజ్ ప్రొఫైల్

18-06-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ హైమావతి

కొండపాక,జూన్17:పెండింగ్ భూ సమస్యల పరిష్కారం కోసమే భూభారతి ఆర్ ఓ ఆర్ చ ట్టాన్ని ప్రభుత్వం తీసుకవచ్చిందని జిల్లా కలెక్టర్ కే. హైమావతి అన్నారు. కొండపాక మండలం అంకిరెడ్డిపల్లి లో జరుగుతున్న రెవెన్యూ సదస్సును మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్బంగా దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను రిశీలించారు.జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి  రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించి రైతులతో మాట్లాడారు.

చాలా కా లంగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యల పరిష్కరించడం కోసమే ప్రభుత్వం భూభారతి ఆర్‌ఓఆర్ చట్టం తీసుకు వచ్చిందని ఎలాంటి భూ సమస్యలు ఉన్న రెవెన్యూ సదస్సుల ద్వారా పరి ష్కరించుకోవాలని సూచించారు. అదేవిదంగా అసైన్డ్ భూములను కొనుగోలు చేసిన పేదవారి పేరుమీద భూహక్కులను బదిలీ పై ప్రభుత్వ నిర్ణయం ప్రకారం చర్యలు తీసుకుంటామని అప్పటి వరకు దరఖాస్తులు ఆన్లైన్ చేసి భద్రంగా ఉంచుతామని తెలిపారు.

రెవెన్యూ సదస్సులలో రైతులు పెట్టుకునే ప్రతీ అర్జీని ఆ అర్జీకి సంబంధించిన భూ వివరాలను రెవెన్యూ రికార్డులలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, దరఖాస్తులన్నింటిని కచ్చితంగా ఆన్లైన్లో పొందుపరిచాలని, ఆలస్యం చేయకుండా అవసరమైన వారికి నోటీసులు జారీ చేసి సాదా బైనామ, సీలింగ్, సర్వేనెంబర్, భూవిస్తీర్ణంలో మార్పులు, చేర్పులు, లావని పట్టా అన్ని రకాల భూ సమస్యలను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు.రెవెన్యూ గ్రామంలో రైతులు, వ్యవసాయ భూమి, ప్రభుత్వ భూమి తదితర భూమి పూర్తి వివరాలతో విలేజ్ ప్రొఫైల్ తయారు చేయాలని తహసీల్దార్ శ్యామ్ ను ఆదేశించారు.

ఆయిల్ పామ్ తోటలతో అధిక ఆదాయం

ఆయిల్ ఫామ్ తోటల సాగు తో అధిక దిగుబడులు పొందవచ్చని జిల్లా కలెక్టర్ హైమావతి కొ న్నారు. జిల్లాలో ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ డ్రైవ్ లో భాగంగా మంగళవారం కొండపాక మండలం బందారం గ్రామంలోని రైతు నర్రా జైపాల్ రెడ్డి క్షేత్రంలో 10 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాల్లో ఇప్పటికే 12,300 ఎకరాల పై చిలుకు ఆయిల్ పామ్ సాగు జరుగుతుందని, దాదాపు 1200 టన్నుల ఆయిల్ పామ్ గెలలను ఉత్పత్తి చేయటం జరిగిందని, ప్రతీ 15 నుండి 20 రోజులకీ ఒకసారి ఆయిల్ పామ్ పంటను కోయటం జరుగుతుందని తెలిపారు.

2025-26 సంవత్సరానికి జిల్లా 6500 ఎకరాల టార్గెట్‌అని ,రైతులు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆయిల్ పామ్ మొక్కలని పెంచటానికి ముందుకు రావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన, పట్టు శా ఖ అధికారిణి జి. సువర్ణ , ఆయిల్ ఫెడ్ మేనేజర్ భాస్కర్ రెడ్డి, కొండపాక డివిజన్ వ్యవసాయ అధికారి బాబు, మండల ఉధ్యాన అధికారిణి కౌసల్య, మండల వ్యవసాయ అధికారి శివరామకృష్ణ,  ఉద్యాన శాఖ అధికారులు బాలాజి, రమేష్, మౌనిక, ఏఈఓ ప్రనుషా, ఫీల్ ఆఫీసర్ రాజు తదితరులుపాల్గోన్నారు