18-06-2025 12:00:00 AM
ఎబీవీపీ జాతీయ కార్యదర్శి శ్రవణ్ బి రాజ్
సిద్దిపేట జూన్ 17: విద్యార్థి నాయకునిపై ఆయుధాలతో హత్యయత్నం చేసిన రాజ్యాంగ వ్యతిరేక గూండాలను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ జాతీయ కార్యదర్శి శ్రవణ్ బి రాజ్ డిమాండ్ చేశారు. మంగళవారం సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రవణ్ బి రాజ్ మాట్లాడుతూ నిత్యం విద్యారంగ, దేశ, సామాజిక సమస్యలపై పోరాటం చేసే ఏబీవీపీ సిద్దిపేట జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్య పై గూండాలు దాడి చేయడం బాధాకరం అన్నారు. కొన్ని దుష్ట శక్తులకు మొదటి నుండి రాజ్యాం గం పైన ప్రజాస్వామ్యం పైన నమ్మకం లేదన్నారు. ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఆదిత్య రాజ్యాంగ వ్య తిరేక శక్తుల చర్యలను ప్రశ్నించినందుకు ఆయన పైన పదునైన ఆయుధాలతో హత్యాయత్నం చేయడం దారుణమన్నారు.
ఎబివిపి కార్యకర్తలు తుపాకులకు, తాటాకు చప్పట్లకు భయపడరని, ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక శక్తుల వల్ల ఈ రాష్ట్రంలో 42 మంది కార్యకర్తలు బలి అయినప్పటికీ ఎక్కడ దైర్యం వదలకుండా విద్యార్థి లోకం కోసం ఇంకా ఎక్కువ పని చేసే ఏకైక పరిషత్ అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ అని చెప్పారు. దాడి జరిగి మూడురోజుల అయినప్పటికీ నిందితులు దొరకకపోవడం సిగ్గుచేటనీ, మంత్రి ఇలాకాలో ఇలా జరిగిన కూడా స్పందించకపోవడం సిగ్గుమాలిన చర్యగా భావిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు, రాష్ట్ర కార్యసమితి సభ్యుడు వివేక్, రాష్ట్ర హాస్టల్ కో కన్వీనర్ పవన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఫణీంద్ర, నగర కార్యదర్శులు పర్షరామ్, చరణ్, రాజ్, రాకేష్, రాహుల్, వసంత్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.